27 March, 2026 | 1:38 AM

నిర్మాణాలకు నిధులు మంజూరు చేయండి

27-03-2026 12:02 AM

మేడ్చల్ అర్బన్ మార్చి 26(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని 24వ మున్సిపల్ వార్డులో సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణాలకు మల్కాజిగిరి బిజెపి ఎంపీ మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ ను నిధులు మంజూరు చేయాలని కోరినట్లు మున్సిపల్ బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ఎంపి  రాజేందర్ ఎంపి ఫండ్ తో రోడ్లు, అండర్ డ్రైనేజీలు లేని ప్రాంతాలను వర్క్ ఇన్స్పెక్టర్ తో కలిసి పరిశీలించి వాటి నిర్మాణానికి కావలసిన ఎస్టిమేట్ సిద్ధం చేయించ డం జరిగిందని తెలిపారు.

ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని 24వ మున్సిపల్ వార్డులో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయుటకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని మల్కాజిగిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ స్పష్టం చేసినట్లు కౌన్సిలర్ అర్చన తెలిపారు.ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని 24వ మున్సిపల్ వార్డుకు చెందిన సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణాలకు ఎంపీ నిధులను నుండి మంజూరి చేయడానికి కృషి చేస్తానని బిజెపి ఎంపి హామీ ఇచ్చినట్లు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ వెల్లడించారు.