ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు
22-04-2026 10:29 AM
గమ్యం చేరెందుకు ప్రయాణికుల అవస్థలు.
తాండూరులో RTC సమ్మెతో బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) తాండూరులో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత అర్ధరాత్రి నుండి డ్రైవర్లు,కండక్టర్ లు ఇతర సిబ్బంది సమ్మెకు దిగారు. బస్సులన్నీ డిపోకే పరిమితం అయ్యాయి. బుధవారం ఆర్టీసీ సిబ్బంది మహిళా కండక్టర్లు డిపో కి చేరుకొని న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ఈ విభాగాన్ని చూడండి.
బస్సులు రోడ్డు ఎక్కకపోవడంతో ప్రయాణికులు , మహిళలు, చిన్నారులు గమ్యస్థానాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమ్మె కారణంగా స్థానికంగా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.
ఇవి కూడా చదవండి:






