ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
05-05-2026 12:27 AM
32 మందికి గాయాలు
ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
కొండపాక, మే 4: కుకునూరు పల్లి మండలం లకుడారం స్టేజి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు సంఘటన సోమవారం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల మేరకు కుకునూరు పల్లి మండలం రాజీవ్ రహదారి లకుడారం స్టేజి వద్ద ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టిన కరీంనగర్-2డిపో బస్సు, కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు సుమారు ఈ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉండగా, 32 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని, విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అంబులెన్స్ లల్లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని అన్నారు.






