రిటైర్డ్ ఉపాధ్యాయులు సమాజ సేవలో భాగస్వాములు కావాలి
22-04-2026 07:54 PM
సర్పంచ్ పాలకి సురేష్
కోదాడ,(విజయక్రాంతి): రిటైర్డ్ ఉపాధ్యాయులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని సర్పంచ్ పాలకి సురేష్ అన్నారు. దొరకుంట జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ లో తెలుగు ఉపాధ్యాయుడు వెంకటయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా బుధవారం నిర్వహించిన సన్మానం కార్యక్రమంలో సర్పంచ్ పాలకి సురేశ్ హాజరై మాట్లాడారు. వెంకటయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






