ప్రజాపాలనలో సమస్యల పరిష్కారం
ములకలపల్లి, జూన్ 4 (విజయక్రాంతి): గ్రామపంచాయతీలోని సమస్యలు ప్రజాపాలన ప్రభుత్వం ద్వారా పరిష్కారం కానున్నట్లు జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ తెలిపారు. గురువారం ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామపంచాయతీ లో జరిగిన గ్రామసభ లో సర్పంచ్ కుంజా వినోద్ మాట్లాడుతూ జగన్నాధపురం గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జలగం మాధవి, వార్డు సభ్యులు, సెక్రటరీ సునేష్ వ్యవసాయ శాఖ ఏఈఓ, ఆర్డబ్ల్యూ యస్ ఎఈ గృహ నిర్మాణ శాఖ ఏఈ,ఎన్ఆర్ఈజీఎస్, విద్యా, వైద్య, ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులు,గ్రామ కమిటీ అధ్యక్షులు పామర్తి కృష్ణ,మరీదు నాగు,మీడియం నారాయణ, రామాచారి,కూరం రామకృష్ణ, సోయం బోడప్ప,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.






