17 July, 2026 | 2:07 PM

Breaking News

స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •  

గ్రామాభివృద్ధి నిధుల మంజూరుకోసం ఎమ్మెల్యేకు వినతి

07-03-2026 12:00 AM

చారకొండ మార్చి 6: మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ చి లికేశ్వరం శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నా యకులు శుక్రవారం హైదరాబాద్ లోని స్వ గృహంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సం దర్భంగా గ్రామంలో మినీ అంగన్వాడి భవ నం, ఇందిరమ్మ ఇండ్లు, అండర్ డ్రైనేజ్, అదనంగా సిసి రోడ్లు నిర్మాణానికి,

చంద్రాయన్ పల్లి నుంచి శేరిఅప్పారెడ్డిపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. రైతులకు సబ్సిడీ స్ప్రింకర్ పైపులు, గ్రామంలో నెలకొన్న కరెంటు సమస్యలు తీర్చాలని కోరారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సాంబయ్య గౌడ్, నాయకులు పర్వతాలు, బాధగోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.