12 July, 2026 | 2:50 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. తడిసిముద్దైన పత్తి, మొక్కజొన్న

04-11-2025 12:27 PM

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని(Warangal district) పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం కురుస్తోంది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో మోస్తరు వర్షం కురుస్తోంది. హనుమకొండలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో వాన పడుతోంది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వరంగల్ లో ఉరుములు మెరుపులతో కూడి జోరు వాన కురుస్తోంది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్ లో పత్తి, మొక్కజోన్న తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం పడుతోందని అప్రమత్తమైన రైతులు పత్తి, మొక్కజోన్నను షెడ్లకు తరలించేలోపే వర్షం(Rains) కురవడంతో మొత్తం తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. పత్తి, మొక్కజొన్నలు తడిసిన కారణంగా కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు తలలు పట్టుకుంటున్నారు. అటు జనగామ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. స్టేషన్ ఘన్ పూర్, లింగాల ఘనపూర్, తరిగొప్పుల, నర్మెట్ట, బచ్చన్నపేట మండలాల్లో వర్షం దంచికొడుతుంది. వర్షానికి తడిసిన పంటను ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంట నష్టపోయారు.