ఇంటికి చేరుకున్న పీవీ సింధు.. సురక్షితంగా వచ్చానని ట్వీట్
భారతీయులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
సురక్షితంగా ఉన్నాను: పీవీ సింధు
"బెంగళూరులో ఇంటికి తిరిగి వచ్చాను, సురక్షితంగా ఉన్నాను. గత కొన్ని రోజులు తీవ్రంగా అనిశ్చితంగా ఉన్నాయి, కానీ తిరిగి వచ్చినందుకు నేను నిజంగా కృతజ్ఞురాలిని" అంటూ సింధు తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. "చాలా క్లిష్ట సమయంలో మమ్మల్ని ఇంత బాగా చూసుకున్న అద్భుతమైన గ్రౌండ్ టీమ్లు, దుబాయ్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, సానుభూతి, వృత్తి నైపుణ్యం పదాలు చెప్పలేని దానికంటే ఎక్కువ. ప్రస్తుతానికి, విశ్రాంతి తీసుకోవడానికి, రీసెట్ చేయడానికి తదుపరి దశలను గుర్తించడానికి ఇది సమయం" అని సింధు పేర్కొన్నారు.
ఫుజైరా నుంచి ఢిల్లీ, ముంబయి, కొచ్చికి విమానాలు
యూఏఈలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) ఏర్పాట్లు చేస్తోంది. యూఏఈలోని ఫుజైరా నుంచి ఢిల్లీ, ముంబయి, కొచ్చికి విమానాలు నడుపుతోంది. రేపట్నుంచి ఫుజైరా-ఢిల్లీ, ఫుజైరా- ముంబై విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అవసరాల మేరకు మరిన్ని విమానలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని విమాన సంస్థలు వెల్లడించాయి. కొందరు ప్రయాణికులు దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. మరో విమానం ప్రయాణికులతో ఒమన్ నుంచి ఢిల్లీ చేరుకుంది.




