21 April, 2026 | 5:10 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

తంగళ్ళపల్లి ఐకెపి కేంద్రంలో 9,600 క్వింటాళ్ల వరి కొనుగోలు పూర్తి

18-12-2025 08:01 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఐకెపి కేంద్రంలో ఈరోజు దాదాపు 9,600 క్వింటాళ్ల వరి కొనుగోలు విజయవంతంగా పూర్తయ్యింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సజావుగా నిర్వహించడంతో ఐకెపి కేంద్రం నిర్వాహకులను రైతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ మార్కెట్ కమిటీ చైర్మన్ నేరళ్ల నర్సింగం గౌడ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, ఐకెపి సెంటర్ మహిళా సోదరులు గుడ్డి రేణుక, శైలజతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరళ్ల నర్సింగం లారీ డ్రైవర్‌ను శాలువాతో సన్మానించి, వరి రవాణా సకాలంలో జరిగేలా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.