21 April, 2026 | 6:32 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

కాంగ్రెస్ పార్టీలో చేరిన మామిడిపల్లి సర్పంచ్

18-12-2025 08:03 PM

పన్నాల లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ కాసర్ల పవిత్ర..

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

వేములవాడ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి నూతంగా ఎన్నికైన సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ కాసర్ల పవిత్ర వార్డు సభ్యులు బెదిరే మహిపాల్, కులేరి రవి, నంద్యాడపు రజిత, లోకుర్తి శంకర్ లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశీ వారిని ఘనంగా సత్కరించారు. గ్రామాలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నూతన పాలకవర్గానికి తన వంతు సహాయ సహకారలు అందిస్తామని తెలిపారు.