16 May, 2026 | 7:48 PM

కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి

16-05-2026 06:39 PM

* అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్

గుండాల,(విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) ద్వారా ఇప్పటివరకు కొనుగోలు చేసిన మొక్కజొన్న గింజలను వెంటనే గోడౌన్లకు తరలించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) గుండాల మండల కమిటీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. శనివారం మండల కేంద్రంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ద్వారా రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి నేలలు గడుస్తున్నా కూడా మక్కలను గూడౌన్లకు తరలించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 వేల గన్ని బ్యాగులు సరఫరా చేయగా, కేవలం మూడు గన్ని బ్యాగుల మొక్కజొన్నను మాత్రమే  తరలించారని, మిగిలిన మొక్కజొన్నను త్వరగా తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మే 19 న రైతులతో భారీ ధర్నాను చేపట్టనున్నట్లు ఆయన హెచ్చరించారు.