28 August, 2026 | 8:16 PM

విద్యుత్ అగాధంతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి

28-08-2026 07:20 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి):  సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల గ్రామంలో  విద్యుత్ షాక్ తో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్ ఐ గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... దిర్శించర్ల గ్రామానికి చెందిన బట్టు.సతీష్, తండ్రి భూషయ్య వయస్సు 42 సంవత్సరాలు, దిర్శించర్ల గ్రామ శివారులోని ఇటుక బట్టీల వెనుక, రైతు వ్యవసాయ పొలానికి చెందిన ట్రాన్స్ఫార్మర్, మరమ్మత్తు చేస్తూ ఉండగా విద్యుత్ ప్రసరించడంతో షాక్ తగిలి మరణించడం జరిగింది. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.