ప్రధాని సభను విజయవంతం చేయాలి
09-05-2026 08:33 PM
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్
సిద్దిపేట క్రైం: సికింద్రాబాద్ లో ఆదివారం జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ కోరారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. మోదీ మూడోసారి ప్రదాని అయ్యాక తెలంగాణ వస్తున్నారని, రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. గతం లో తెలంగాణ అభివృద్ధికి రూ. 13 లక్షల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. మోదీ సభకు సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోడీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.






