రాజ్యసభకు హరివంశ్ నారాయణ్ సింగ్— నామినేట్ చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఉపసభాపతి హరివంశ్ నారాయణ్ సింగ్ను(Harivansh Narayan Singh) రాష్ట్రాల మండలి సభ్యుడిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) నామినేట్ చేశారు. హరివంశ్ ఎగువ సభ సభ్యుడిగా పదవీకాలం ఏప్రిల్ 9న ముగిసింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ అనంతరం ఏర్పడిన ఖాళీలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు.
"భారత రాజ్యాంగంలోని 80వ అధికరణం, (1)వ ఖండం ఉప-ఖండం (a) ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఆ అధికరణంలోని (3)వ ఖండంతో కలిపి చదువగా నామినేటెడ్ సభ్యులలో ఒకరి పదవీ విరమణ కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి, హరివంష్ను రాష్ట్రాల మండలి (Council of States)కి నామినేట్ చేయడానికి రాష్ట్రపతి సంతోషించారు." అని ప్రభుత్వం జారీ చేసిన ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. 69 ఏళ్ల హరివంశ్, బిహార్కు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభ సభ్యుడిగా తన రెండు పర్యాయాలను పూర్తి చేసుకున్నారు. ఆయన రాజ్యసభ ఉపసభాపతిగా కూడా సేవలందించారు.




