22-02-2026 02:29:33 PM
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం పర్యటించారు. మేరఠ్ లో రూ.12,390 కోట్ల విలువైన ప్రాజెక్టులు జాతికి అంకితం చేసి, శతాబ్ది నమో భారత్ మెట్రోను మోదీ ప్రారంభించారు. దేశంలోనే తొలి హైస్పీడ్ మెట్రో ట్రైన్, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఆయన పేర్కొన్నారు. హైస్పీడ్ మెట్రో ట్రైన్ లో మోడీ ప్రయాణించి, ప్రయాణికులతో ముచ్చటించారు. దేశంలో తొలి 'నమో భారత్' ఆర్ఆర్టీఎస్ సేవలను మోడీ ప్రారంభించారు.