31 March, 2026 | 6:43 PM

ముత్తారంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి

31-03-2026 05:17 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం, మండలాధ్యక్షుడు బాలాజీ 

మంథని,(విజయక్రాంతి): ఎప్రిల్ 3,4వ తేదీలలో ముత్తారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో  ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం, జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్, ముత్తారం మండలాధ్యక్షుడు దొడ్డ బాలాజీ తెలిపారు. కేశనపల్లి లో వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ వైద్య శిబిరాన్ని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు