సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలి
ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తేనే పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
గోలేటి గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు జమ్మిడి అరుణ్ , మిడిగొండ లక్ష్మి - లింగమూర్తి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు.




