10 April, 2026 | 5:09 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

10-04-2026 03:12 PM

పాక్ అసలు రంగు బయటపడింది

ఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం

ఇస్లామాబాద్: ఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ను నాశనం చేయాలని పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్(Pakistan's Defence Minister Khawaja Asif)  సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ మంత్రి వ్యాఖ్యలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ ను క్యాన్సర్ దేశంగా పేర్కొన్నారు. లెబనాన్ లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని ఖవాజా ఆరోపించారు.

పాక్ మంత్రి ఖవాజా వ్యాఖ్యలు ఏ మాత్రం సహించరానివని ఇజ్రాయెల్ మండిపడింది. శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం పేరుతో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ఇజ్రాయెల్ చురకలంటించింది. ఖవాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ అసలు రంగు బయటపడిందని ఇజ్రాయెల్ తెలిపింది. పాక్ తటస్థ మధ్యవర్తిగా ఉండగలదా అని ఇజ్రాయెల్ సందేహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల నుంచి తమ దేశాన్ని రక్షించుకుంటామని ఇజ్రాయెల్ తెల్చిచెప్పింది.