ఎన్టీఆర్ జయంతి వేడుకలు
28-05-2026 03:21 PM
చందుర్తి,మే 28,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు లింగంపల్లి వెంకటి ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల అధ్యక్షులు నెంబర్ వెంకటి మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి, రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పాల్గొన్నారు.






