ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవు
- బిజెపి మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి
కొండపాక,(విజయక్రాంతి): కుక్కునూరుపల్లి మండల కేంద్రం కొనుగోలు కేంద్రాలలో రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని శుక్రవారం బిజెపి మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి తాహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అనుముల సంపత్ రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలోని దాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, తరుగు పేరుతో రైతులను మోసం చేసి ఇష్టానుసారంగా కటింగ్ వ్యవస్థను అరికట్టాలి.
రానున్న రుతుపవనాలను దృష్టిలో ఉంచుకొని మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో వేగవంతం చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీసం సదుపాయాలు లేక గన్ని బ్యాగులు లేక ఇబ్బంది పడుతున్నారని, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచి, దాన్యం కొనుగోలు చేసిన రైతులకు వెనువెంటనే అకౌంట్లో డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.






