17 July, 2026 | 2:23 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

గ్రామ సంఘాల పనితీరును పరిశీలించిన ఎన్ఐఆర్డీ బృందం

21-11-2025 11:39 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం సిద్దరామేశ్వర నగర్ లో శుక్రవారం గ్రామ మహిళ సంఘాల పనితీరును ఎన్ ఐ ఆర్ డి బృందం పరిశీలించింది. గ్రామ మహిళ సంఘాల పనితీరును పలు రాష్ట్రాలకు చెందిన బృందం సభ్యులు పాల్గొని పరిశీలించారు. మహిళా సంఘాల ద్వారా చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి అభినందించారు.

సంఘాల ద్వారా చేస్తున్న వ్యాపారాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. లాభాలు ఎలా వస్తున్నాయి వ్యాపారాలు ఎలా చేస్తున్నారు అనే విషయాలను మహిళా సంఘాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.