13 July, 2026 | 9:49 PM

Breaking News

నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •  

గోలిలింగాలలో ఇందిరమ్మ ఇళ్ల పనులు పురోగతినీ పరిశీలించిన ఎంపీడీవో

02-05-2026 07:48 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోలిలింగాల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు చేయబడగా, ప్రస్తుతం ఎక్కువ ఇళ్లు నిర్మాణ దశల్లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నాణ్యతతో పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ సూచించారు.

లబ్ధిదారులు కూడా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు.అవసరమైన సాంకేతిక సహాయం, మార్గదర్శకాలు అందించడానికి అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి నివాసం ఉంటుండగా,మిగిలిన ఇళ్ల పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామ సర్పంచ్ బుర్రకల రోజా బాబు,కార్యదర్శి సంతోష్ కుమార్,లబ్ధిదారులు పాల్గొన్నారు.