గోలిలింగాలలో ఇందిరమ్మ ఇళ్ల పనులు పురోగతినీ పరిశీలించిన ఎంపీడీవో
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోలిలింగాల గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు చేయబడగా, ప్రస్తుతం ఎక్కువ ఇళ్లు నిర్మాణ దశల్లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నాణ్యతతో పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ సూచించారు.
లబ్ధిదారులు కూడా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు.అవసరమైన సాంకేతిక సహాయం, మార్గదర్శకాలు అందించడానికి అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు.ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి నివాసం ఉంటుండగా,మిగిలిన ఇళ్ల పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామ సర్పంచ్ బుర్రకల రోజా బాబు,కార్యదర్శి సంతోష్ కుమార్,లబ్ధిదారులు పాల్గొన్నారు.






