10 May, 2026 | 6:58 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఒత్తిడిని జయిస్తే విజయం మీదే

24-01-2026 08:08 PM

కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ప్రకాష్ బనావత్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులు ఒత్తిడిని జయిస్తే విజయం మీ సొంతమవుతుందని కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ ప్రకాష్ బనావత్ అన్నారు. శనివారం మండలంలోని బాబా పూర్ లో గల మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ క్లాస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వార్షిక పరీక్షలు దగ్గరికొస్తున్న కొద్ది పిల్లల్లో అనేక రకాల ఒత్తిడి ,భయం పెరిగి చదివినది గుర్తుకు రాదాని తద్వారా పిల్లలు ఆందోళన చెందడం జరుగుతుందన్నారు.

దీంతోపాటు ఆరోగ్యం క్షమించడం, నిద్ర రాకపోవడం ఎంత చదివినా గుర్తుకు రాకపోవడం జరుగుతుందని తెలిపారు. మానసిక శారీరక ఒత్తిడికి గురవడం వల్ల పరీక్షల్లో ఫెయిలవుతామనే భయం పెరిగి మరింత ఒత్తిడికి లోనవ్వడం వల్ల పరీక్షల్లో విఫలమయ్యే అవకాశం ఉంటుంద తెలిపారు. వీటన్నింటి నుండి బయటపడాలంటే అద్భుతమైన నాలుగు చిట్కాలు పాటించాలని సూచించారు.  పీస్, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రజెంటేషన్  ఈ నాలుగింటిని పాటిస్తే భయాన్ని ఓడించవచ్చని పి ఫోర్ మంత్రాన్ని బోధించారు.

ఉపాధ్యాయులు సైతం విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా స్నేహపూర్వకంగా విద్యను బోధించినట్లయితే వారిలో మరింత మనో ధైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షల్లో పదికి పది రావాలంటే భయాన్ని విడనాడాలని సూచించారు. విద్యార్థుల మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమైన వాటిని నివృత్తి చేసుకునేలా దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుకన్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.