16 July, 2026 | 2:47 PM

Breaking News

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం   •   స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలి   •   నీటి విడుదల కోసం రైతుల ధర్నా   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుపై ఎమ్మెల్యే వైఖరి తెలపాలి   •   వర్షం కోసం రైతుల పూజలు   •   జగ్గారం లో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె   •   సీతారామ సాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేకాఫ్ పాయింట్ ను పరిశీలించిన మంత్రులు   •   హిందూ విద్యార్థిని కల్మాను చదవమనడం బాధకరం   •   హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: బండి సంజయ్   •   అమెరికా ఫెడ్ రిజర్వ్ లో ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక బాధ్యతలు   •  

తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

17-10-2025 08:51 AM

హైదరాబాద్: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం కొనసాగుతోంది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణాదిలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు(Telangana rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అటు ఏపీలోని పలు జిల్లాకు వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుమల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. గంటలకు 35-55 కీలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.