ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
31-03-2026 04:12 PM
కొల్చారం,(విజయక్రాంతి): మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం అందించిన ఐదు లక్షల రూపాయలతో నూతన ఇంటి నిర్మాణం చేపట్టుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ ఆంజనేయులతో కలిసి ఆమె ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి ద్వారా నిధులు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.




