నిబద్ధతతో ప్రజాసేవ చేయండి
మహబూబ్నగర్ పాలకవర్గానికి ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి సూచన
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మహబూబ్నగర్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మేయర్ గుమాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్రెడ్డిని, కార్పొరేటర్లను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజల విశ్వాసానికి తగిన విధంగా పారదర్శకంగా, అభివృద్ధి దిశగా, ప్రజాసేవలో నిబద్ధతతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పి వెంకటేష్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్మత్ అలి, ఐఎన్టీయుసి రాములు యాదవ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి పాల్గొన్నారు.




