9 March, 2026 | 8:07 AM

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

08-03-2026 03:22 PM

హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ పాల్గొన్నారు. సంబంధిత అధికారులు, ఇంజినీర్లు, కలెక్టర్లతో హైదరాబాద్ జలసౌధలో సమావేశమై పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులపై, కోయిల్ సాగర్, జూరాల ప్రాజెక్టులు, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాలపై సమీక్ష చేశారు. భూసేకరణ, సమస్యలు, పనులు పురోగతి, నిధులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు.