14-02-2026 04:28:07 PM
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం వద్ద బెటాలియన్ నందు ఉన్న శ్రీ పరమేశ్వరుని ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని నేడు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.