1 July, 2026 | 9:12 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

31-10-2025 11:05 PM

ఏరియా జిఎం దుర్గం రామచందర్ 

మణుగూరు,(విజయక్రాంతి): సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏరియా  సింగరేణి సంస్థ ఆధ్వర్యం లో నవంబర్ 9న  మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఏరియా జిఎం దుర్గం రామచందర్ శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 100 ప్రైవేటు సంస్థల లో వివిధ విభాగాల్లో 3 వేల ఖాళీలు భర్తీ కోసం ఎంపిక జరుగుతుందన్నారు . నిరుద్యోగ యువత హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు 

చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంటోందని, ఈ నేపథ్యంలో పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి స్థానికంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని నిరుద్యోగ యువత సద్విని యోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. సింగరేణి సంస్థ లో ఉద్యోగ నియామకాల తో పాటు, నిరుద్యోగ యువత అందరికీ ఏదో ఒక ఉపాధి లేదా ఉద్యోగం కల్పించడం కోసం ఈ తరహా కార్యక్రమాలను సింగరేణి సంస్థ స్వచ్ఛందంగా చేపడు తుందని , ఈ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతలో నైపుణ్యాలు పెంచడమే కాకుండా వారికి ఉద్యోగ అవకా శాలను కల్పించేందుకు వీలుగా జాబ్ మేళాలను కూడా ఏర్పాటు చేయిస్తున్నట్లు వివరించారు.