9 May, 2026 | 5:33 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

వినాయక నిమజ్జనానికి మెడికవర్ హాస్పిటల్స్ అత్యవసర వైద్య సేవలు

06-09-2025 12:54 PM

హైదరాబాద్: వినాయక నిమర్జనానికి(Vinayaka immersion) వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తక్షణమే చికిత్స అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospitals) హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) మీద అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చాయి. ఈ సేవలలో నిపుణులైన వైద్యులు, నర్సులు, అంబులెన్స్‌లతో పాటు ఆర్ బీఎస్, బీపీ చెక్‌అప్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.

అదనంగా, భక్తులకు తాగునీరు అందించేందుకు వాటర్ బాటిల్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మార్కెటింగ్ హెడ్(Secunderabad Marketing Head) చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్య భద్రత మా మొదటి ప్రాధాన్యం. నిమర్జనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా మా వైద్య బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా భక్తులకు తక్షణ సేవలు అందించగలగడం మా ఆనందంగా భావిస్తున్నాము” అని తెలిపారు.