06-02-2026 12:00:00 AM
భద్రాచలం ఆర్టిఏ ఆఫీసు వద్ద కారులో తరలిస్తున్న ఎండు గంజాయి స్వాధీనం
భద్రాచలం, ఫిబ్రవరి 5, (విజయక్రాంతి): భద్రాచలం శివారులోని ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పట్టుకుని గంజాయిని కారుని స్వాధీనం చేసుకున్నారు.ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సిహెచ్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఆర్టిఏ ఆఫీసు భద్రాచలం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమా నాస్పదంగా వస్తున్న ఒక కారు టి జి 08 హెచ్ క్యూ 9088 ను ఆపి తనిఖీ చేయగా దానిలో 15.070 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ గంజాయి ఒరిస్సా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లుగా నిందితుల విచారణలో వెల్లడయ్యింది.
ఈ గంజాయి కేసులో హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన రఘు విష్ణోయి, జ్యోతిపూర్కు చెందిన శేఖర్ రామ్లు ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి హైదరాబాద్కు తరలిస్తూ పట్టుబడి నారు. తదుపరి విచారణ నిమిత్తం 10, 73,500 రూపాయల గంజాయిని, కారు, 2 సెల్ ఫోన్లు ఇద్దరు ముద్దాయిలను భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించడ మైనది. ఈ తనిఖీలలో కానిస్టేబుల్స్ సుధీర్, వెంకట్, హరీశ్, విజయ్ వీరబాబు, ఉపేందర్ లు పాల్గొన్నారు. భద్రాచలంలో గంజాయిని పట్టుకున్న సిబ్బందిని ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్ ,తిరుపతి అభినందించారు.