22 May, 2026 | 11:35 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టుల హత్యలు

20-11-2025 12:40 AM
  1. వెంటనే సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలి
  2. ఏకపక్ష కాల్పులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్‌కౌంటర్ అంటున్నారు
  3. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, నవంబర్ 19 (విజయ క్రాంతి): ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను ప్రభుత్వం హత్య చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై వెంటనే సమగ్ర న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల విషయంలో న్యాయస్థానాలు కూడా స్పందించడడం లేదని, ఈ పరిస్థితి చాలా నష్ట దాయకమన్నారు. బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

హిడ్మాను కొట్టి చంపి దానికి ఎన్‌కౌంటర్ అనే పేరు పెడుతున్నారని విమర్శిం చారు. ఎన్‌కౌంటర్ అంటే పరస్పర కాల్పులు జరగా లి కదా అని ప్రశ్నించారు. ఏకపక్షంగా కాల్పులు జరపడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్‌కౌంటర్ అంటున్నార ని విమర్శించారు. మావోయిస్టులతో చర్చిం చి సమస్యలను తెలుసుకోవాల్సింది పోయి చంపుతున్నారని మండిపడ్డారు.

2026 మార్చి వరకు మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారని గుర్తు చేశారు. అందులో భాగంగా హిడ్మా దంపతుల ఎన్‌కౌంటర్ బూటకమన్నారు. కాల్పులు విరమించుకుంటున్నామని ప్రకటించినా చంపుతున్నారని, దండకారణ్యంలోని ఖనిజాల కోస మే ఇదంతా చేస్తున్నారని కూనంనేని ఆరోపించారు. ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.