16 May, 2026 | 4:14 PM

Breaking News

నిర్మల్ అభివృద్ధి ద్రోహి ఎమ్మెల్యే   •   సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   గ్రామీణ ప్రజలకు మెడికవర్ ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఏఐ టూల్స్   •   పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారాన్ని మోపి నడ్డి విరుస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్   •   మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయి సభ్యులకు రివార్డులను అందజేత   •   తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు నకు కమిటీ ఏర్పాటు పట్ల హర్షం   •   లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం నూతన సెక్రటరీ గా పగడాల నరేష్   •   వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్‌డీఏ ఏపీడీ విజయ లక్ష్మీ   •   మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘స్త్రీనిధి’ కొండంత అండ   •  

వ్యక్తిని కారుతో ఢీ కొట్టి కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లి

15-02-2026 12:00 AM

మేడ్చల్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): పోకిరీలు అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒక వ్యక్తిని ఢీ కొట్టి అలాగే కిలోమీటర్ల వరకు ఈడ్చి కెళ్ళిన ఘటన కుషాయిగూడ పరిధిలో జరిగింది. సతీష్ అనే వ్యక్తి తన వా హనంలో వెళ్తుండగా కొంతమంది పోకిరీలు కారుతో వెనుక నుంచి ఢీ కొట్టి వెళ్లిపోయారు.

సతీష్ ఆ వాహనాన్ని ఓవర్టేక్ చేసి ఆపి ప్రశ్నిస్తుండగా కారుతో ఢీ కొట్టి అలాగే ఈడ్చు కెళ్లారు. సతీష్ కారు బంపర్ పట్టుకొని కొద్ది దూరం వెళ్లిన తర్వాత విడిచిపెట్టాడు. సతీష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోకిరిలు గంజాయి మత్తులో ఉన్నారని, ఆ వాహనానికి పోలీస్ సైరన్ కూడా ఉందని తెలిసింది. సైరన్ వేసుకుని నడిపినట్లు తెలిసింది.