27 April, 2026 | 7:24 PM

అగ్ని ప్రమాదంతో మొక్కజొన్న పంట దగ్ధం

27-04-2026 05:14 PM

సిరికొండ,(విజయక్రాంతి): మండలంలోని పోచం పల్లి గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. రైతు కుమరం కల బాయి కి చెందిన చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న కు ఆకస్మికంగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పైపులు, వ్యవసాయ పనికి ఉపయోగించే పరికరాలు సహా పలు వస్తువులు కాలిపోయాయి. పంటను కష్టపడి పండించి నిల్వ చేసిన సమయంలో ఇలా నష్టం కలగడంతో తీవ్ర మనోవ్యథ వ్యక్తం చేసిన కలబాయి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఘటన చోటుచేసుకున్న వెంటనే గ్రామస్థులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే అధికారులు స్పందించి నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని రైతు కుమరం కలబాయి కోరుతున్నారు.