11 April, 2026 | 9:48 PM

Breaking News

మునుగోడులో ఘనంగా రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   13 నుంచి అరైవ్ - అలైవ్... ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యo కావాలి   •   సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పూలే   •   మద్యం శాఖకు ఉన్న మంత్రి విద్యాశాఖకు ఎందుకు లేడు?   •   చిన్న‌చెల్మెడలో సీసీ రోడ్డు ప‌నులు ప్రారంభం   •   తిప్పారం సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం   •   నో హెల్మెట్ నో పెట్రోల్, నో సీట్ బెల్ట్ నో ఫ్యూయల్   •   సిద్దిపేటలో మత్తు పదార్థాల విముక్తి చికిత్స కేంద్రం ప్రారంభం   •   ఘనంగా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు   •   గ్రామాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి   •  

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతి రావు పూలే

11-04-2026 07:41 PM

- కేయూ పరిశోధక విద్యార్థి డి.తిరుపతి

హనుమకొండ,(విజయక్రాంతి): అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి, సామాజిక అసమానతలను తొలగించిన క్రాంతి రేఖ మహాత్మ జ్యోతిరావు పూలే అని కేయూ పరిశోధక విద్యార్థి డి తిరుపతి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలో వివేకనందా రీసెర్చ్ స్కాలర్స్  హాస్టల్లో, పరిశోధక విద్యార్థుల ఆధ్వర్యంలో రీసెర్చ్ స్కాలర్ డి.తిరుపతి అధ్యక్షతన మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమంను నిర్వహించారు. అనంతరం తిరుపతి  జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం తిరుపతి మాట్లాడుతూ... సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిబా పూలే  అని అన్నారు.సమసమాజ స్థాపనకు స్ఫూర్తి ప్రదాత,సామాజిక సంస్కరణలకు నాంది కర్తగా,బడుగు బలహీన వర్గాల ఉన్నతికి తన జీవితాన్ని అకింతం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.ఆ మహనీయునికి ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో కేయూ రీసర్చ్ స్కాలర్స్ తాళ్లపెళ్లి నరేష్, యం.డి పాషా, కేతపాక ప్రసాద్, కందికొండ తిరుపతి, బొచ్చు తిరుపతి, జనగాం రాజారాం, నాగరాజ్, మారుతి, మర్రి మహేష్, దూడపాక అశోక్, గణేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.