11 April, 2026 | 12:05 PM

Breaking News

భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •  

సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగ్ స్వాధీనం

04-10-2025 05:04 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సహనా బేగం, తన ఇద్దరు మానవరాళ్లతో కలిసి మహబూబాబాద్ కి వచ్చి కురవి గేట్ వద్ద ఆటో ఎక్కి బేతోల్ లో దిగి తన చెల్లి ఇంటికి వెళ్లగా, తన బ్యాగ్ ని ఆటోలో మర్చిపోయిన విషయం గుర్తు వచ్చి వెంటనే బాధితురాలు కురవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అదనపు ఎస్ఐ జయకుమార్, పోలీస్ కానిస్టేబుళ్లు అనిత, రమేష్ లు సాంకేతికత ఆధారంతో ఆటో మరిపెడ వైపు వెళ్తోందని తెలుసుకొని బాధితురాలిని పోలీస్ వాహనంలో తమతో పాటు తీసుకువెళ్లి పురుషోత్తమాయగూడెం వద్ద ఆటోను ట్రేస్ చేసి తనిఖీ చేయగా బ్యాగ్ దొరకడంతో పాటు బ్యాగ్ లో ఉండాల్సిన తులం బంగారం, రెండు స్మార్ట్ సెల్ ఫోన్స్ స్వాధీనం తీసుకొని బాధితురాలికి అందజేశారు. బ్యాగు పోగొట్టుకున్న సంఘటనపై ఫిర్యాదు చేయగానే కురవి పోలీస్ స్పందించిన తీరు, ఆమె వస్తువులు ఆమెకి దక్కడంతో సంతోషం వ్యక్తం చేస్తూ, పోలీసులకు కృతఙ్ఞతలు తెలిపారు.