బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే
11-04-2026 12:00 PM
బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి. జ్ఞాన సుందర్
తుంగతుర్తి,(విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి, మహిళలకు విద్యాబోధన కల్పించిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలేనని తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్ అన్నారు. మహాత్మా జ్యోతి రావు పూలే 199వ జయంతి సందర్భంగా శనివారం తుంగతుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. సమాజంలోని అసమానతలు తొలగించి, విద్యా ఆవశ్యకతను తెలిపిన మహోన్నత మూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వేణురాజ్, వజీర్, అమిత్, రవి,రాజు, సైదులు తదితరులు పాల్గొన్నారు*




