28 July, 2026 | 12:45 PM

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

28-07-2026 12:21 PM

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనల మధ్య మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి.

గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను అభినందిస్తూ స్పీకర్ ఓం బిర్లా సమావేశాన్ని ప్రారంభించారు. దీనిని అనుసరించి, జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై జరిగిన పోలీసు చర్యకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు, 2026పై చర్చను సభ చేపడుతుందని స్పీకర్ బిర్లా పేర్కొన్నారు. ప్రభుత్వ పరీక్షలలో అక్రమాలను నిరోధించేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026ను సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే, సభలో గందరగోళం కారణంగా ఎటువంటి కార్యకలాపాలూ జరగలేదు.