ఎవరితో పెట్టుకోకూడదో.. మోదీ వాళ్లతోనే పెట్టుకున్నారు
01-08-2026 03:20 PM
వాట్సాప్ అంకుల్స్.. ఇన్ స్టా పిల్లల్లో ఎవరు గెలిచారో చూశాం
వచ్చే ఎన్నికల్లో 50 శాతంపైగా జెన్ జీ ఓట్లు
హైదరాబాద్: యువతరం కొత్త తరహాలో ఢిల్లీలో కదం తొక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సూచించారు. నరేంద్ర మోదీ ఎవరితో పెట్టుకోవద్దో వారితో పెట్టున్నారని కేటీఆర్ చమత్కరించారు. వాట్సాప్ అంకుల్స్.. ఇన్ స్టా గ్రామ్ పిల్లల్లో ఎవరూ గెలిచారో చూశామన్నారు. సోషల్ మీడియా లేకపోతే జవాబుదారీతనం వచ్చేది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 50 శాతంపైగా జెన్ జీ ఓట్లు వేయబోతున్నారని జోస్యం చెప్పారు. తప్పు జరుగుతున్నా రాయలేని పరిస్థితి దేశంలో ఉందని కేటీఆర్ ఆరోపించారు.






