14 June, 2026 | 4:34 PM

Breaking News

భోజన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి   •   ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం   •   ఆలయ నిర్మాణకు విరాళం అందజేత   •   ఎమ్మెల్యే అనుచర వర్గంపై దృష్టి పార్టీ పటిష్టతపై ప్రత్యేక సమావేశాలు.   •   అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •  

కాలనీలో కలియతిరిగి.. సమస్యలు తెలుసుకుని..

16-11-2025 09:31 AM

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మార్నింగ్ వాక్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ ప్రతి కాలనీలో కలియ తిరిగి ఇంటింటికి సమస్యలు తెలుసుకుని ప్రజలతో మమేకమయ్యారు. ఉదయాన్నే తమ కాలనీలో ఎమ్మెల్యే కనబడడంతో స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురై ఆనందపడ్డారు. తమ కాలనీలలో ఉన్న మురికి నీరు వ్యవస్థ, మిషన్ భగీరథ మంచినీటి అవస్థలను, రోడ్ల పరిస్థితులను స్థానికులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. వాటిని రాసుకున్న ఎమ్మెల్యే వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా, జన్నారపు శంకర్, తదితరులు ఉన్నారు.