28 June, 2026 | 3:13 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం: కేటీఆర్

01-10-2025 02:44 PM

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) పాలన దశాబ్దం తెలంగాణలో రైతులకు(Farmers) స్వర్ణయుగంగా నిలిచిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా 2014-2023 మధ్య రైతుల ఆత్మహత్యలు 95 శాతం తగ్గాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు(BRS Working President KT Rama Rao) అన్నారు. ఎన్సీఆర్బీ (National Crime Records Bureau) డేటాను ఉటంకిస్తూ, రైతు బంధు, ప్రభుత్వ పంట సేకరణ, రుణమాఫీలు, కాళేశ్వరం(Kaleshwaram) వంటి నీటిపారుదల ప్రాజెక్టులు వ్యవసాయ కుటుంబాలకు స్థిరత్వాన్ని తీసుకురావడానికి దోహదపడ్డాయని కేటీఆర్ ప్రశంసించారు. అయితే, కేవలం రెండు సంవత్సరాలలో కొత్త కాంగ్రెస్ పాలనలో(Congress rule) పరిస్థితి మరింత దిగజారిందని ఆరోపించారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ రాగానే పరిస్థితి తారుమారైందని ఆరోపించిన కేటీఆర్ రెండేళ్లలోనే సుమారు 700కు పైగా అన్నదాతల ఆత్మహత్యలు నమోదయ్యాయని విమర్శించారు. మళ్ళీ కేసీఆర్ రావాలి.. రైతులు చల్లగా నూరేళ్లు వర్ధిల్లాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రైతు ఆత్మహత్యల తెలంగాణను కేసీఆర్ పాలన దశాబ్దం పాటు అన్నపూర్ణగా మార్చిందని హరీష్ రావు అన్నారు.