ట్రంప్ హత్యకు ఇరాన్ స్కెచ్
మరింత ముదిరిన పశ్చిమాసియా వార్
ట్రంప్ హత్యకు ఇరాన్ ప్రణాళిక
టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates)పై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికాకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఖర్గ్ ద్వీపం టార్గెట్ గా అమెరికా సైన్యం దాడులు చేసింది. మరోవైపు ఇరాన్ కు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం మొదలైతే ఇరాన్ ఖతమేనని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) హత్యకు ఇరాన్ ప్రణాళిక చేస్తున్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వెల్లడించాయి. ఖమేనీ అంతిమయాత్ర సమయంలో అమెరికాకు ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చింది. యుద్ధాన్ని తీవ్రతరం చేస్తుందేమోనని ఆందోళన. కొన్ని వారాలుగా ట్రంప్ హత్య ప్రణాళికలపై యూఎస్ నిఘా సంస్థలకు సమాచారం అందింది. ఖమేనీ అంతిమయాత్రలో ట్రంప్ ను చంపేస్తామంటూ నినాదాలు చేశారు. 2020లో ఇరాన్ సైనికాధికారి ఖాసి సులేమానీ హత్య జరిగింది. ఇరాన్ హిట్ లిస్టులో తానే నంబర్ వన్ లో ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. గురువారం తెల్లవారుజామున అమెరికా ఇరాన్పై కొత్తగా వైమానిక దాడులు ప్రారంభించగా, దానికి ప్రతిస్పందనగా టెహ్రాన్ అమెరికా మిత్రదేశాలైన మధ్యప్రాచ్య దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ కాల్పుల మార్పిడి మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించడానికి ఉద్దేశించిన మధ్యంతర ఒప్పందానికి ముప్పు తెచ్చింది.
ట్రంప్ తలపై 100 మిలియన్ డాలర్ల బహుమతి
అయతొల్లా అలీ ఖమేనీ మరణం పట్ల దేశం సంతాపం తెలుపుతున్న తరుణంలో, ట్రంప్ను హత్య చేయాలని డిమాండ్ చేస్తూ ఇరాన్ వాసులు ఒక భారీ బ్యానర్ను ఆవిష్కరించారు.






