6 April, 2026 | 12:28 AM

ఉత్సాహంగా ఐఎంటి హైదరాబాద్ స్నాతకోత్సవం

05-04-2026 10:29 PM

హైదరాబాద్, 4 ఏప్రిల్ 2026 : ఐఎంటి హైదరాబాద్ 2024-2026 బ్యాచ్ విద్యార్థుల కోసం నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమం  ఉత్సాహంగా సాగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ట్రాన్స్‌వరల్డ్ ఛైర్మన్ , 2025 ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత  రమేష్ ఎస్ రామకృష్ణన్‌ హాజరుకాగా డీన్ అకాడమిక్స్, ప్రొఫెసర్ (డాక్టర్) సౌరభ్ భట్టాచార్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐఎమ్‌టి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ (డా) కె ఎం బహరుల్ ఇస్లాం, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులు, అధ్యాపక బృందం కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ (డాక్టర్) కె ఎం బహరుల్ ఇస్లాం మాట్లాడుతూ  ప్రపంచ అభ్యాస వాతావరణంలో అనుకూలతను, శ్రేష్ఠతను అలవర్చుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. సీఐఐ-ఐఎల్‌ భాగస్వామ్యంతో అందిస్తున్న పీజీడీఎమ్ (ఎల్‌ఎస్‌సీఎమ్) మరియు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తో కలిసి అందిస్తున్న పీజీడీఎమ్ (ఐటీ) వంటి కీలక ప్రోగ్రామ్లను గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఐఎంటి హైదరాబాద్‌లోని విశిష్ట అధ్యాపకులు వివిధ రంగాలలో చేసిన అద్భుతమైన పరిశోధన ఫలితాలను కూడా వివరించారు.  ఎవర్‌నార్త్ హెల్త్ సర్వీసెస్ , రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి డైరెక్టర్ మరింతగా వివరించారు. చీఫ్ మెంటర్ కమల్ నాథ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కృత్రిమ మేధస్సు  యొక్క పెరుగుతున్న పాత్రను, అలాగే కమ్యూనికేషన్, సహకారం , నైతిక విచక్షణ వంటి మానవ నైపుణ్యాలతో పాటు సాంకేతిక అక్షరాస్యత యొక్క ఆవశ్యకతను వెల్లడించారు.

ముఖ్య అతిథి రమేష్ ఎస్ రామకృష్ణన్ పట్టభద్రులను అభినందిస్తూ, వ్యాపారం అనేది ప్రాథమికంగా ప్రజలు మరియు లక్ష్యం గురించేనని నొక్కి చెప్పారు. నాయకత్వానికి సహకారం, జిజ్ఞాస, నిజాయితీ అవసరమన్నారు. సవాళ్లను ధైర్యంతో ఎదుర్కొని, సమాజానికి అర్థవంతంగా తోడ్పడాలని ఆయన విద్యార్థులకు సూచించారు. విద్యాపరమైన ప్రతిభకు గుర్తింపుగా, బ్యాచ్‌లోని అత్యుత్తమ విద్యార్థులకు ఆరు బంగారు పతకాలు, ఐదు వెండి పతకాలు మరియు ఒక విశిష్ట సాధన పురస్కారం ప్రదానం చేశారు.