15 June, 2026 | 3:33 PM

Breaking News

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అర్ధాంతరంగా నిలిపివేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి   •   ఓట్ చోరీ, సీట్ చోరీ చేసేది కాంగ్రెస్సే: రామచందర్‌రావు   •   ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీ   •   కిరాతకుడుని ఉరితీయాలి..   •   కేటీఆర్ ను కలిసిన పట్టణ అధ్యక్షులు   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు   •   శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •  

ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా

13-10-2025 01:01 AM

తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు  

అలంపూర్, అక్టోబర్ 12: ఏపీ నుంచి తెలంగాణకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఎస్త్స్ర శేఖర్ తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తా జాతీయ రహదారిపై ఆదివారం బ్లూ కోట్ విధులు నిర్వర్తిస్తున్న అబ్దుల్ భాష ,రవి,లు ఇసుక లోడుతో వెళుతున్న లారీని తనిఖీ చేశారు.

డ్రైవర్ కేతావత్ బాలును విచారించగా ఇసుకను ఏపీ తాడిపత్రి నుంచి హైదరాబాదుకు తరలిస్తున్నట్లు చెప్పాడు. అనుమతి పత్రాలు లేకపోవడంతో లారీని స్టేషన్ కి తరలించి డ్రైవర్‌తో పాటు యజమాని ప్రభు లింగంపై కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర తెలిపారు.