1 July, 2026 | 8:51 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ప్రియుని మోజులో భర్తను కడతేర్చారు

05-11-2025 12:00 AM

వనపర్తి టౌన్ నవంబర్ 04:ప్రియునితో కలిసి ఆమె భర్తను హత్య చేసి అనుమానం రాకుండా వనపర్తి పట్టణ పోలీస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని పానుగల్ రోడ్డు గణేష్ నగర్ చెందిన నాగమణి,ప్రియుడు శ్రీకాంత్ లను నిందితులుగా గుర్తించామని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

వనపర్తి పట్టణానికి చెందిన నాగమణి ప్రియుడు శ్రీకాంత్ ఆమె భర్తను అక్టోబర్ 25వ తేదీన రాత్రి సమయంలో మద్యంతో మత్తెక్కించి,కూలర్ తాడు సహాయంతో కురుమూర్తిని గొంతు బిగించి హత్య చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకుని శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో శవాన్ని పడేసి,అనుమానం రాకుండా వనపర్తి పట్టణ పోలీస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.కానీ పోలీసుల క్షుణ్ణ దర్యాప్తు చేసి టెక్నికల్ సాక్ష్యాలు, సీసీటీవీ ఆధారాలతో నిందితులు దొరికిపోయారు.

నేరం ఎంత చాకచక్యంగా చేసినా నిజం బయటపడుతుందనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.ఈ కేసు ను 72 గంటల్లోనే కేసు ఛేదించిన వనపర్తి సిఐ బృందం కృషి ఉందన్నారు.ఈ కేసును చేదించడంలో కీలకపాత్ర పోషించిన వనపర్తి సీఐ, కృష్ణయ్య, ఎస్త్స్రలు, పోలీస్ కానిస్టేబుళ్లు ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందజేశారు.ఈ సమావేశంలో వనపర్తి డిసిఆర్బి డిఎస్పి, ఉమామహేశ్వరరావు, వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.