12 August, 2026 | 11:27 AM

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో హుండీ చోరీ

12-08-2026 10:10 AM

చేగుంట ఆగస్ట్ 12,విజయక్రాంతి: చేగుంట పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు, రాత్రి మూసుకో ధరించిన వ్యక్తి  ఆలయంకున్న తాళం పగలగొట్టి, ఆలయంలో ఉన్న హుండిని ఎత్తుకుని వెళ్ళారు. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల పుట్టేజిలను పరిశీలించారు, దొంగ ఎవరనేది, ఎక్కడి నుంచి వచ్చాడు అనే వివరాలు తెలియాల్సింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చేగుంట ఎస్ ఐ చైతన్ కుమార్ రెడ్డి తెలిపారు.