13 April, 2026 | 1:27 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

గోదావరి ఉగ్రరూపం.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు

25-09-2025 09:34 AM

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని(Nizamabad district) పలు మండలాల్లో గురువారం భారీ వర్షం(Heavy rains) కురుస్తోంది. డిచ్ పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్ పల్లి, మోపాల్, సిరికొండ, నిజామాబాద్ గ్రామీణ మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి, మంజీర నదులకు భారీ వరద నీరు చేరుతోంది. కందుకుర్తి వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అంతరాష్ట్ర వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులు వంతెన వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ- మహారాష్ట్ర(Telangana and Maharashtra) మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.