సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు
15-03-2026 05:34 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా గుండి పరశురాములు, ఉపాధ్యక్షుడిగా చిలుకపెళ్లి ఆకాశం ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ... ముదిరాజ్ సంఘాన్ని మరింత బలోపేతం చేసి, సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు గుండి పరశురాములు, ఉపాధ్యక్షుడు చిలుకపెళ్లి ఆకాశం మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో సంఘ అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘానికి చెందిన పలువురు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.




