37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
03-07-2026 04:23 PM
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 37వ డివిజన్ గాయత్రీ నగర్ లో మునిసిపల్ సాధారణ నిధుల నుండి 77 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ మరియు సిసి రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. అలాగే పద్మశాలి స్ట్రీట్ శ్రీనివాస థియేటర్ సమీపంలో సిఎస్ఆర్ నిధులతో ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, 37 వ డివిజన్ కార్పొరేటర్ కె. ఏపిపి చంద్ర, బిజెపి కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,డివిజన్ ప్రజలు పాల్గొన్నారు






