నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ
03-07-2026 04:17 PM
పాల్వంచ,(విజయక్రాంతి): నవ లిమిటెడ్, పాల్వంచ సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో తాటి ఆకుల కళాకృతులు విక్రయించడం గార్మెంట్ మేకింగ్ ద్వారా రూ 2,77,362 వచ్చిన నగదు చెక్కులను యూనిట్ హెడ్ తెలంగాణ ఆపరేషన్ రేర్ అడ్మిరల్ ఎల్ వి శరత్ బాబు (వి) మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా శరత్ బాబు మాట్లాడుతూ... మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఆ కుటుంబం ఎప్పుడూ ఆనందమయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎంహెచ్ఆర్ఏ శ్రీనివాస్ రెడ్డీ, సీఎస్ఆర్సీహెచ్ శ్రీనివాసరావు మహిళలు పాల్గొన్నారు.






